పార్టీని బలోపేతం చేయాలి : ఎంపీ డీకే అరుణ 

పార్టీని బలోపేతం చేయాలి : ఎంపీ డీకే అరుణ 

మద్దూరు, వెలుగు: -ప్రధాని మోడీ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించి, పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని మహబూబ్​నగర్  ఎంపీ డీకే అరుణ సూచించారు. ఆదివారం కొడంగల్  నియోజకవర్గం పెద్ద పస్లావాద్ లో ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం మద్దూరులో మాజీ ఎంపీటీసీ వెంకటయ్యతో కలిసి పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు.సెంట్రల్  స్కీమ్​ల ద్వారా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందేలా కృషి చేయాలని సూచించారు.

ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని, సమస్యలను తన దృష్టికి తేవాలని భరోసా ఇచ్చారు. ఎంపీకి ఉమ్మడి మండల ప్రజలు సమస్యలపై వినతిపత్రాలను అందించారు. పార్టీ రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు ప్రతాప్ రెడ్డి, శంకర్ దామరగిద్ద, సంజీవ్​గౌడ్, ఆదేశ్, రాజు గౌడ్  పాల్గొన్నారు.